అగ్రనటుడు చిరంజీవి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, మరో రెండు చిత్రాలు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. అయితే తాజాగా చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం రూపొందనుందని తెలిసింది.
వినోదాత్మకమైన సినిమాలను తెరకెక్కించడంలో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి ఇటీవలే ఓ కథను వినిపించడం, అందుకు మెగాస్టార్ గ్రీన్సిగ్నల్ కూడా ఇచ్చారని ఫిల్మ్నగర్ ఇన్సైడ్ టాక్. పూర్తి వినోదాత్మకంగా హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారు.