Chiranjeevi congratulates Major team | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘విక్రమ్’ హవానే నడుస్తుంది. సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై పాజిటీవ్ టాక్ను తెచ్చుకుంది. లేటెస్ట్గానే ఈ చిత్రం రూ. 200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చిత్రంపై ప్రశంసలు జల్లులు కురిపించారు. చాలా కాలం తర్వాత కమల్కు విక్రమ్ భారీ విజయాన్నిందించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈచిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. తమిళ స్టార్ సూర్య కీలకపాత్రలో నటించాడు. తాజాగా చిరంజీవి విక్రమ్ టీంను అభినందించాడు.
లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి విక్రమ్ టీంను ఇంటికి పిలిచి అభినందించాడు. విక్రమ్ సక్సెస్ అయిన సందర్భంగా కమల్హాసన్, లోకేష్ కనగరాజ్ను చిరంజీవి సత్కరించాడు. అనంతరం ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా వచ్చాడు. ఈ క్రమంలో చిరు ట్విట్టర్లో ఫోటోలను పోస్ట్ చేస్తూ ‘నా పాత స్నేహితుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. విక్రమ్ సినిమా అద్భుత విజయం సాధించినందుకు నిన్న రాత్రి మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను. కమల్హాసన్తోపాటు సల్మాన్ ఖాన్, లోకేష్ కనగరాజ్ మా ఇంటికి రావడంతో చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ మూవీ చాలా అద్భుతంగా, థ్రిల్లింగ్గా ఉంది. అభినందనలు మిత్రమా. ఈ సినిమా విజయం నీకు మరింత శక్తిని ఇస్తుంది..’ అంటూ చిరు ట్వీట్ చేశాడు.
Absolute joy,celebrating & honouring my dearest old friend @ikamalhaasan for the spectacular success of #Vikram along with my dearest Sallu Bhai @BeingSalmanKhan @Dir_Lokesh & team at my home last night.What an intense & thrilling film it is!!Kudos My friend!! More Power to you! pic.twitter.com/0ovPFK20r4
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2022