Sharwanand 38 | టాలీవుడ్ నటుడు శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. మరపురాని అనుభూతిని కలిగించే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీకి భోగి అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ స్పార్క్ అంటూ అనౌన్స్మెంట్ వీడియోను పంచుకుంది. ‘‘ప్రతి రక్తపు చుక్కకు ఒక కారణం ఉంటుంది. ప్రతి పండగకు ఓ ప్రయోజనం ఉంటుంది’’ అని వీడియోలో తెలిపారు. ఈ వీడియో చూస్తుంటే శర్వానంద్ చాలారోజుల తర్వాత మాస్ మూవీ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ మూవీ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు శర్వానంద్. మే మొదటివారం నుంచి షూటింగ్ శరవేగంగా ప్రారంభంకాబోతుండగా.. ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలో 15 ఎకరాల్లో ఓ భారీ సెట్ను సిద్ధం చేశారు. ఈ మూవీలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించబోతుంది. గతంలో శర్వానంద్, అనుపమ కలిసి శతమానం భవతి అనే సినిమాలో నటించారు. దిల్ రాజ్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ జోడి మళ్లీ జత కడుతుండడంతో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్.ఎస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్.