గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె రూపొందించిన కొత్త ఆల్బమ్ ‘ట్రెండింగో’. ఈ పాటను టి. విజయలక్ష్మి నిర్మించారు. కేవీకే దర్శకత్వం వహించారు. ఈ పాటకు సంగీత సాహిత్యాలను అందించి ఆలపించారు రఘు కుంచె. ఈ పాటను హైదరాబాద్లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో నటి లయ, గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘు కుంచె మాట్లాడుతూ…‘సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత నిత్య జీవితంలో ట్రెండింగ్ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కొన్ని సందర్భాలు సహజంగా ట్రెండ్ అయితే..మరికొన్నింటిని కావాలని ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంతో చేసిన పాట ట్రెండింగో. ఆమెరికాలోని డాలస్లో పాట చిత్రీకరణ జరిపాం. మా పాటను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు.