మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు జోరుగా ప్రచారాలు చేసుకోగా, ఇక ఈరోజు ఓటు వేసేందుకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్కి తరలి వస్తున్నారు.ఈ రోజు ఉదయం తొలి ఓటు పవన్ కళ్యాణ్ వేయగా, ఆ తర్వాత రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సాయి కుమార్,వడ్డే నవీన్, రాశి, శివాజీరాజా, శివ బాలాజీ, సుడిగాలి సుధీర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. గంటన్నరలో30 శాతం పోలింగ్ అయినట్టు తెలుస్తుంది.
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. గతంలో ఇంతపోటీ నేను చూడలేదు. తిప్పికొడితే 900 ఓట్లు ఉండవు. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా’ అని ప్రశ్నించారు. సినిమాలు చేసే వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు అవసరం లేదని పవన్ అన్నారు.మిగతా సెలబ్స్ మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు.