సెలబ్రిటీ కపుల్ రితేష్ దేశ్ముఖ్, జెనీలియా జంటగా విజయాన్ని సాధించారు. వారు కలిసి నటించిన ‘వేద్’ సినిమా సూపర్హిట్ను అందుకుంది. నాగచైతన్య, సమంత జంటగా నటించిన తెలుగు మూవీ ‘మజిలీ’ మరాఠీ రీమేక్గా ‘వేద్’ను తెరకెక్కించారీ భార్యాభర్తలు. రితేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సొంత బ్యానర్ ముంబై ఫిల్మ్ కంపెనీ పతాకంపై జెనీలియా నిర్మాణ బాధ్యతలు వహించింది.
ఇద్దరు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే 15 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మాతృకలో సమంత పోషించిన పాత్రలో జెనీలియా నటించింది. ఆమె నటనకు ప్రశంసలు వస్తున్నాయి. సాధారణంగా ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేస్తే అతి తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. అయితే తెలుగులో ‘మజిలీ’ యావరేజ్ సినిమా కాగా..మరాఠీలో పునర్నిర్మాణమై విజయం సాధించడం విశేషం.