సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) పదో సీజన్ ప్రోమోను శనివారం దుబాయ్లో ఆవిష్కరించారు. బుర్జ్ ఖలీఫా వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సీసీఎల్లో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడబోతున్నాయి. వీటికి కెప్టెన్లుగా తమన్-సుధీర్బాబు (తెలుగు), సుదీప్ (కన్నడ), సోహైల్ ఖాన్ (హిందీ), ఆర్య-జీవా (తమిళం), జిషు సేన్గుప్తా (బెంగాల్), ఉన్ని ముకుందన్ (మలయాళం), బన్ను థిల్లాన్, సోనూసూద్ (పంజాబీ) వ్యవహరించనున్నారు.
ఫిబ్రవరి 23 నుంచి షార్జాలో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. సీసీఎల్ ప్రతీ ఏడాది వృద్ధి చెందుతున్నదని, భారతదేశంలో వివిధ నగరాల్లో 20కిపైగా మ్యాచ్లతో సీజన్ 10 వినోదాన్ని పంచుతుందని సీసీఎల్ వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్ ఇందూరి తెలిపారు.