హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏప్రిల్ 26, 27న రాష్ట్రస్థాయి కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైలాబ్బాబు శనివారం వెల్లడించారు.
ఏప్రిల్ 11న జ్యోతిబాఫూలే, ఏప్రిల్ 14న అంబేదర్ జయంతులను పురసరించుకొని ఏప్రిల్ నెల మొత్తాన్ని మహానీయుల మాసంగా పాటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 200 గ్రామాల్లో వీడీసీల పేరిట అట్టడుగు తరగతులపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.