హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్బాబుతో పాటు నిర్మాత విజయలక్ష్మిపై సైబరాబాద్ పరిధిలోని ఈవోడబ్ల్యూ ఠాణాలో కేసు నమోదైంది. హీరో వేషం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ. 3.5 కోట్లు తీసుకొని మోసగించాడంటూ కూకట్పల్లికి చెందిన హనుమంతరావు ఫిర్యాదు చేయగా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. హనుమంతరావు తన కుమారుడికి తెలుగు సినిమాలో హీరోగా అవకాశం కల్పించాలంటూ మధ్యవర్తి ద్వారా దర్శకుడు అశోక్బాబును సంప్రదించాడు.
తన కుమారుడి నుంచి పలు దఫాలుగా దాదాపు రూ. 3.5 కోట్లు వసూలు చేసి, తీరా అవకాశం కల్పించకుండా మోసగించినట్టు ఫిర్యాదు చేశాడు. బాధితుడి డబ్బుతో అతడిని హీరోగా పెట్టి దర్శకుడు సినిమా తీశాడని, స కాలంలో డబ్బు ఇవ్వక నిర్మాణం ఆగిపోయినట్టు విచారణలో తేలింద ని ఈవోడబ్ల్యూ పోలీసులు తెలిపా రు. రూ.3.5 కోట్లు తీసుకొని సినిమా విడుదల చేయకపోగా డబ్బులూ ఇ వ్వడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు చెప్పారు.