టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) ప్రాజెక్టును లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటివరకు షురూ కాలేదు. చిత్రీకరణపై ఇప్పటివరకు కొత్త అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా అభిమానుల కోసం ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. మహేశ్-త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుందట.
ఈ మూవీని 2023 ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మొత్తానికి తాజా అప్ డేట్తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేశ్ బాబు 100 రోజులు డేట్స్ ఇచ్చేశాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్-మహేశ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మహేశ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.