ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. ధనుష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం చిత్ర టీజర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్కిషన్ పాల్గొన్నారు. దోపిడీ దొంగ, హంతకుడిగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్ను పట్టుకోవడానికి ప్రకటించిన భారీ రివార్డ్తో టీజర్ ఆసక్తికరంగా ఆరంభమైంది. ఓ యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్ మిల్లర్ శత్రుమూకలపై విరుచుకుపడే యాక్షన్ ఘట్టాలతో టీజర్ ఉత్కంఠగా సాగింది.
‘ధనుష్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిస్తున్న చిత్రమిది. 1930-40 నేపథ్యంలో కథ నడుస్తుంది. భారీ నిర్మాణ విలువలతో ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటించానని సందీప్కిషన్ పేర్కొన్నారు. డిసెంబర్ 15న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: జి.శరవణన్, సాయి సిద్థార్థ్, రచన-దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్.