దర్శకుడు శ్రీనువైట్ల సినిమాలంటే వినోదానికి పెట్టింది పేరు. తనదైన బ్రాండ్ కామెడీతో ఆయన టాలీవుడ్లో ప్రత్యేకతను సృష్టించుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక రేసులో వెనకబడ్డారు.
‘అమర్ అక్బర్ ఆంథోని’ చిత్రం తర్వాత ఆయన నాలుగేళ్లుగా సినిమాలకు విరామం తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల ఓ ఫుల్లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్కు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు గోపీమోహన్ కథను అందిస్తున్నారని సమాచారం. శ్రీనువైట్ల చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని వార్తలొస్తున్నాయి.