బటర్ ఫ్లై థియరీ అంటే ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆరేళ్ల కింద ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో అందరికీ అర్థమయ్యేలా సుకుమార్ ఈ థియరీ గురించి చెప్పాడు. ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఒక ఇన్సిడెంట్ మరి ఎక్కడో జరిగే ఇంకో ఇన్సిడెంట్ కు ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది. అదే బటర్ ఫ్లై థియరీ అంటే..! ఇంకా అర్థం అయ్యేలా చెప్పాలంటే భూమరంగ్ అనమాట. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు.. తిరిగి తిరిగి మనం చేసిన పనులు మన దగ్గరికి వచ్చి ఆగుతాయి. ఇప్పుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విషయంలో ఇదే జరుగుతుంది.
అయన్ ముఖర్జీ తరకెక్కించిన ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మూడు భాగాలుగా రానున్న బ్రహ్మాస్త్ర మొదటి పార్ట్ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. దక్షిణాదిన సినిమాను రాజమౌళి ప్రమోట్ చేస్తుండడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇది నేషనల్ ట్రెండింగ్ చేస్తున్నారు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్. బ్రహ్మాస్త్ర సినిమాతో చనిపోయిన సుశాంత్ కు ఏంటి సంబంధం అనుకోవచ్చు.. కానీ ఇక్కడే అసలు స్టోరీ ఉంది.
నిజానికి ఆరేళ్ల కింద ఈ సినిమాకు ముహూర్తం పెట్టాలి అనుకున్నప్పుడు అందులో మొదటిగా అనుకున్న హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్. అప్పట్లో వరుస విజయాలతో బాలీవుడ్లో రైజింగ్ లో ఉన్న సుశాంత్ తో ఈ సినిమా చేయాలనుకున్నాడు దర్శకుడు అయన్ ముఖర్జీ. కానీ నెపోటిజం కారణంగా అతడిని సినిమా నుంచి తొలగించి.. రణబీర్ కపూర్ ను కరణ్ జోహార్ తీసుకొచ్చాడు అంటూ ప్రచారం మొదలైంది. ఇదే ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమాకు శాపంగా మారింది. ఈ సినిమాను ఎవరూ చూడొద్దు అంటూ.. బాయ్ కాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో కోరుతున్నారు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫ్యాన్స్. మరి రేపు సినిమా విడుదలైన తర్వాత దీనిపై ఇది ఎలాంటి ప్రభావం చూపించబోతుందో చూడాలి.