అద్వితీయ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మచారి’. మల్లేశం, సిరి, స్వప్న నటిస్తున్న ఈ చిత్రానికి నర్సింగ్ దర్శకుడు. త్వరలో విడుదలకానుంది. ఈ చిత్ర ఆడియో టీజర్ను ఎంఎల్సీ దేశపతి శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ సంస్కృతి, చరిత్ర నేపథ్యంలో చాలా కథలున్నాయి. ఇప్పుడు వాటిని తెరకెక్కించే ట్రెండ్ మొదలైంది. తెలంగాణకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎక్కువ మంది సినీరంగంలోకి రావడం శుభపరిణామం.
దర్శకుడు నర్సింగ్ వాస్తవిక ఘటనలతో మంచి కథ రాసుకున్నాడు’ అన్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘దుబాయ్కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే అతనికి అమ్మాయి దొరకదు. ఈ నేపథ్యంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడన్నదే చిత్ర ఇతివృత్తం. తెలంగాణ నేపథ్యంలో అందరిని ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ, సంగీతం: పాండురంగ, నిర్మాత: బి. రాంభూపాల్ రెడ్డి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: నర్సింగ్.