తమిళ హీరో సూర్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా. మాస్ సినిమాలను ప్రేమించే ప్రేక్షకులకు ఇది నిజంగా గొప్ప వార్తే. సరైన మాస్ క్యారెక్టర్ పడితే సూర్య ఎలా విజృంభిస్తాడో ‘సింగం’ సిరీసే చెబుతుంది. ఇక బోయపాటి మాస్ గురించి చెప్పేదేముంది. వీళ్లిద్దరూ కలిస్తే గాలి, నిప్పూ కలిసినట్టే. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువా’ చిత్రంలో నటిస్తున్నారు సూర్య. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది.
ఇక బోయపాటి ‘స్కంద’ ఈ నెల 28న విడుదల కానుంది. ‘స్కంద’ తర్వాత బోయపాటి చేసేది బాలకృష్ణ సినిమానే అని అందరూ అనుకున్నారు. కానీ బాలకృష్ణ దర్శకుడు బాబీ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. ఓ వైపు ‘స్కంద’ విడుదలకు రెడీ అయింది. అందుకే ఈ గ్యాప్లో సూర్య కథకు పదునుపెట్టే పనిలో ఉన్నారట బోయపాటి. ‘కంగువా’ తర్వాత బోయపాటి సినిమా చేయడానికి సూర్య సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.