లండన్: జేమ్స్ బాండ్ ( James Bond ) సినిమా నో టైమ్ టు డై రిలీజ్కు సిద్ధమవుతోంది. కరోనా వల్ల ఆ సినిమా రిలీజ్ వాయిదాప1డుతూ వచ్చింది. అయితే వచ్చే నెలలో లండన్లో ఆ సినిమా ప్రీమియర్ షోను నిర్వహించనున్నారు. ఆ చిత్రా నిర్మాతలు శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీన లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రీమియర్ షో నిర్వహించనున్నారు. ప్రొడ్యూసర్లు మైఖేల్ జీ విల్సన్, బార్బరా బ్రక్కోలీ, డైరక్టర్ కారీ జోజి ఫుకునాగాలతో పాటు హీరో డానియల్ క్రేగ్ .. రెడ్కార్పెట్ ఈవెంట్లో పాల్గొననున్నారు. జేమ్స్ బాండ్ సిరీస్లో నో టైమ్ టు డై 25వ చిత్రం. బ్రిటీష్ గూఢాచారి జేమ్స్ బాండ్ కథాంశం సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే నో టైమ్ టు డై చిత్రం.. గత మార్చిలోనే ప్రీమియర్ షో నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి వల్ల ఆ సినిమా పలుమార్లు వాయిదాపడింది. అక్టోబర్ 8వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.