బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన షాహిద్కపూర్ పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్లో నటించబోతున్నారు. అనీస్ భాజ్మీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని దిల్రాజు, ఏక్తాకపూర్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. ఆగస్ట్ 1న ఈ చిత్రం సెట్స్మీదకు వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో షాహిద్కపూర్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని తెలిసింది.
‘సంపూర్ణ హాస్య ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ఈ కథ షాహిద్కపూర్ను ఎంతగానో ఆకట్టుకుంది. విరామం లేకుండా చిత్రాన్ని పూర్తి చేయాలని మూడు నెలల పాటు డేట్స్ కేటాయించారు. షాహిద్కపూర్ కెరీర్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. షాహిద్కపూర్ నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘బ్లడీ డాడీ’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.