Ameesha Patel | ఇటీవల విడుదలైన ‘గదర్-2’ చిత్రం ద్వారా భారీ విజయాన్ని దక్కించుకుంది బాలీవుడ్ సీనియర్ కథానాయిక అమీషా పటేల్. కొన్నేళ్లుగా ఆర్థికపరమైన వివాదాలు, కోర్టు కేసులతో సతమతమవుతున్న ఆమెకు ఈ సినిమా విజయం నైతికైస్థెర్యాన్నిచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కథానాయికల అందం, అభినయం గురించి అమీషాపటేల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అందం ఒక్కోసారి తారలకు శాపంగా మారుతుందని అభిప్రాయపడింది.
ఆమె మాట్లాడుతూ ‘కహో నా ప్యార్ హై, గదర్, హమ్రాజ్ చిత్రాల్లో నేను హీరోలతో సమానమైన పాత్రలను పోషించాను. అయినా ఆ సినిమాల్లో నన్ను గ్లామర్ కోణంలోనే చూశారు. నా నటన గురించి ఎవరూ మాట్లాడలేదు. తెరపై చాలా అందంగా కనిపించడం వల్ల నా అభినయం మరుగున పడిపోయింది. అందంగా ఉన్నారు కాబట్టే నాయికలుగా రాణిస్తున్నారనే తప్పడు అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందం, అభినయం కలబోసినప్పుడే తారలు ఇండస్ట్రీలో రాణిస్తారు’ అని చెప్పుకొచ్చింది.