Kiara Advani – Sidharth Malhotra | బాలీవుడ్ లవ్బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్ర – కియారా అద్వానీ పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ వారంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారు. గతేడాది కియారా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమయంలో త్వరలోనే ఆమె తన వివాహం జరుగుతుందని చెప్పింది. బాలీవుడ్లో బ్యాచిలర్స్లో ఒకడైన సిద్ధార్థ్ మల్హోత్రా.. కియారాతో పీకలలోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
కియారా కుటుంబం ముంబయిలో నివసిస్తుండగా.. సిద్ధార్థ్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. వీరిద్దరి పెళ్లి రాజస్థాన్లోని జైసల్మేర్లో పెళ్లి జరుగుతుందని, ఇప్పటికే ఏర్పాట్లు మొదలైనట్లు సమాచారం. ఈ నెల 6న వివాహబంధంతో ఇద్దరూ ఒక్కటవుతారని, సూర్యగఢ్ ప్యాలెస్లో పెళ్లి వేడుక జరుగనున్నదని తెలుస్తున్నది. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరుగనుండగా.. 5న సంగీత్తో సంబురాలు మొదలవనున్నాయి. 7న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం.
మూడు రోజుల పెళ్లి వేడుకకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారని.. కత్పుత్లీ, మంగనియార్ కళాకారులు ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అలాగే విందు మెనూలో స్థానిక రాజస్థానీ వంటకాలతో పాటు కాంటినెంటల్, భారతీయ వంటకాలను సైతం అతిథులకు వడ్డించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అతిథులు థార్ ఎడారి అందాలను చూసేందుకు ప్రత్యేకంగా ఒంటెలతో సవారీలను సైతం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే, పెళ్లికి హాజరయ్యే అతిథుల జాబితాలో షాహిద్, మీరా కపూర్, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, ఇషా అంబానీతో పాటు వంద నుంచి 125 మంది అతిథులను వేడుకకు ఆహ్వానించినట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తున్నది.