బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. సల్మాన్ఖాన్, సంజయ్దత్ వంటి అగ్ర నటులు ఇప్పటికే సౌత్ చిత్రాల్లో మెరిశారు . తాజాగా వీరి వరుసలో ఇమ్రాన్హష్మీ చేరారు. పవన్కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) చిత్రంలో ఇమ్రాన్హష్మీ నటించబోతున్నారు.
ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నిర్మాణ సంస్థ సోషల్మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీడీ దానయ్య నిర్మిస్తున్నారు.