దక్షిణాది వారు తమ సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని, హిందీ కంటే తాను సౌత్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్. దక్షిణాదిలో పేరొందిన సినిమాలన్నింటిని తాను చూశానని తెలిపారు. దర్శకత్వంతో పాటు పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించిన ఆయన ప్రస్తుతం తమిళ చిత్రం ‘వన్ టూ వన్’లో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. విజయ్ సేతుపతితో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన దక్షిణాది చిత్రాలపై ప్రశంసలు కురిపించారు. ‘కమల్హాసన్, రజనీకాంత్లను నేనెంతగానో అభిమానిస్తా. వారి వల్లే నాకు దక్షిణాది చిత్రాలపై ఆసక్తి పెరిగింది. అలాగే హిందీలో డబ్ అయిన చిరంజీవి, నాగార్జున సినిమాలన్నింటిని చూశా. ‘గీతాంజలి’ సినిమా నన్ను బాగా ఆకట్టుకుంది’ అని అనురాగ్ కశ్యప్ చెప్పారు. విక్రమ్ తాజా చిత్రం ‘తంగలాన్’ టీజర్ అద్భుతమని అనురాగ్ కశ్యప్ కొనియాడారు. ఈ తరహా విజువల్స్ను హిందీ సినిమాల్లో చూడలేం. దక్షిణాది ప్రజలు తమ చరిత్ర, సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ప్రస్తుతం హిందీ సినిమా సహజత్వాన్ని కోల్పోయింది’ అని అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యానించారు.