మొదటి సినిమా ‘అర్జున్రెడ్డి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు సందీప్రెడ్డి వంగ. ‘అర్జున్రెడ్డి’ రీమేక్ ‘కబీర్సింగ్’తో బాలీవుడ్లోనూ అద్భుతం సృష్టించారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఆ సినిమాకు బాలీవుడ్ విమర్శకులు చాలా మంది నెగెటివ్ రివ్యూలే ఇచ్చారు. అయితే సందీప్రెడ్డి వాళ్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శకులపై ఘాటుగా స్పందించారు.
తన తాజా చిత్రం ‘యానిమల్’ విడుదల తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు సందీప్రెడ్డి. ఇటీవల ‘యానిమల్’ను విమర్శంచిన బాలీవుడ్ విమర్శకులను ఉద్దేశించి పలు ఇంటర్వ్యూల్లో గట్టి కౌంటర్లే ఇచ్చాడు. ‘బాలీవుడ్లో చాలా మంది దర్శకుల వద్ద డబ్బులు తీసుకొని పెయిడ్ రివ్యూలు రాస్తుంటారు. ఇతరుల సినిమాలను టార్గెట్ చేస్తుంటారు. ‘యానిమల్’ను కూడా ఇలాగే లక్ష్యం చేసుకున్నారు. ఈ సినిమాను మూడు గంటల టార్చర్గా అభివర్ణించడం అన్యాయం.
ఈ చిత్రం సాధించిన ఓపెనింగ్స్ గురించి, మా కష్టం గురించి వీళ్లు ఎక్కడా ప్రస్తావించలేదు. బాలీవుడ్లో నెపోటిజం ఎక్కువే. తమవాళ్ల సినిమాలే ప్రమోట్ చేసుకుంటారు. అడ్డొచ్చినవాళ్లతో క్రూరంగా వ్యవహరిస్తారు. బాలీవుడ్లో వివక్ష ఎలా ఉంటుందో చాలా అవార్డు ఫంక్షన్లలో చూశాను. దాని గురించి మాట్లాడటానికి రెండు రోజుల సమయం పడుతుంది. ఈ విషయంలో నేను చిన్న పిల్లాడిలా ఏడవాలనుకోవడంలేదు’ అని సందీప్రెడ్డి అన్నారు.