సినిమా సెలబ్రిటీలు తమ అభిమానులకు టచ్లో ఉండేందుకు ఎక్కువగా సోషల్ మీడియానే ప్లాట్ఫామ్గా ఎంచుకుంటారు. దాని ద్వారానే తమ అభిమానులకు ఎక్కువగా చేరువ కాగలరు. ఏవైనా ఈవెంట్స్లో పాల్గొన్నా.. ఫోటోలు, వీడియోలు, తమ షూటింగ్ వివరాలు, వ్యక్తిగత విషయాలను కూడా సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ గ్లామర్ షోను సోషల్ మీడియా వేదికగానే ప్రదర్శిస్తుంటారు. వాళ్లలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ముందు వరుసలో ఉంటుంది. తను ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, హాలీడే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
తాజాగా బ్లాక్ బికినీ టాప్లో దిశా పటానీ తీసుకున్న మిర్రర్ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ ఫోటో చూసి.. దిశా పటానీ అస్సలు తగ్గడం లేదు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల జిమ్లో కసరత్తులు చేస్తున్న ఓ వీడియోను దిశా షేర్ చేసిన విషయం తెలిసిందే. బ్యాక్ నుంచి తను కనిపించకుండా కేవలం ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది దిశా.