G2 Movie | టాలీవుడ్ యాక్టర్ అడివిశేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘జీ 2’(G2). 2018లో శేష్ హీరోగా శశి కిరణ్ టిక్కా తెరకెక్కించిన ‘గూఢచారి’ (Gudachari2) బాక్సాఫీసు వద్ద హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘జీ2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకత్వం వహించనుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో విలన్ రోల్కు సంబంధించి ఒక సాలిడ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో విలన్గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇమ్రాన్ హష్మీ మరోవైపు పవన్ కళ్యాణ్ ఓజీలో విలన్గా టాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు.
ఇక ఈ బ్లాక్బస్టర్ సీక్వెల్లో అడివిశేష్కు జోడీగా బాలీవుడ్ స్టార్ నటి బనితా సంధు నటించనుంది. బనితా సంధు బాలీవుడ్ మూవీ అక్టోబర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘జీ2’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఇక ఈ సీక్వెల్ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీవీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.