All India Rank | బోధిసత్వ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆల్ ఇండియా ర్యాంక్’. వరుణ్ గ్రోవర్ తొలిసారి దర్శకత్వం వహించారు. గ్రోవర్ ఇంతకుముందు ‘మసాన్’, ‘సేక్రేడ్ గేమ్స్’ సినిమాలకు కథ అందించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఆల్ ఇండియా ర్యాంక్’లో ఐఐటీ ఔత్సాహిక విద్యార్థుల వాస్తవిక ప్రయాణాన్ని చూపించనున్నారు.
తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల హాస్టల్ సంస్కృతికి అనుగుణంగా నడుచుకుంటూ ర్యాంకుల కోసం పోరాడుతున్న ప్రతి ఐఐటీ స్టూడెంట్ కథే ఈ సినిమా అని చిత్రబృందం వెల్లడించింది. ట్రైలర్ సోమవారం విడుదలైంది. దర్శకుడు గ్రోవర్ తన ఎక్స్ ఖాతాలో ‘నా దర్శకత్వంలో వస్తున్న తొలి సినిమాకు చెందిన ట్రైలర్ ఇది. ఫిబ్రవరి 23న ప్రేక్షక ప్రపంచంలోకి వస్తున్నది’ అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ముఖ్య తారాగణం: బోధిసత్వ శర్మ, సమతా సుదీక్ష, షీబా చద్దా, గీతా అగర్వాల్ శర్మ తదితరులు, నిర్మాతలు: సంజయ్ రౌత్రాయ్, సరితా పాటిల్, గాయత్రి ఎం.