మెగాస్టార్ చిరంజీవి మరి కొద్ది గంటలలో 66వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో అభిమానులు సంబరాలు మొదలు పెట్టేశారు.మరోవైపు ఆయనతో సినిమాలు చేసే దర్శకులు క్రేజీ అప్డేట్స్తో సిద్ధంగా ఉన్నారు. సైరా తర్వాత వరుస సినిమాలకు ఓకే చెప్పిన చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాకి సంబంధించి మెగా అప్డేట్ రేపు రానుంది.
ఇక మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంకి సంబంధించిన అప్డేట్ సాయంత్రం రానుంది.ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్గా రూపొందుతున్న మూవీకి సంబంధించి రేపు ఉదయం 9గం.లకు సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ రానుంది.ఇక బాబీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి సంబంధించి కూడా అప్డేట్ రాబోతుంది. రేపు సాయంత్రం 4గం.ల 5ని.లకు అప్డేట్ ఇవ్వనున్నారు.
లూసీఫర్ రీమేక్ కి సంబంధించి టైటిల్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ పేరు దాదాపుగా ఫిక్సయినట్టే. మరోవైపు.. వేదాళం రీమేక్ కి భోళా శంకర్
అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. బాబి దర్శకత్వంలో చిరంజీవి చేయనున్న సినిమాకి వీరయ్య
అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.