Bipasha Basu | బాలీవుడ్ స్టార్ కపుల్స్ బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ తల్లిదండ్రులయ్యారు. బిపాసా శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. పాపకు దేవి బిపాసా సింగ్ గ్రోవర్గా నామకరణం చేసినట్లు ఈ జంట వెల్లడించింది. బిపాసా ఈ ఏడాది ఆగస్టులో తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రెగ్నెన్సీకి సంబంధించి కొన్న ఫొటోలు షేర్ చేస్తూ… తమ బిడ్డ కోసం ఎంతో ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
కాగా, బిపాసా-కరణ్ 2015లో ‘అలోన్’ సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించడంతో 2016 ఏప్రిల్ 30న కుటుంబ సభ్యుల అనుమతితో వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లైన ఆరేళ్లకు ఇప్పుడు తొలిసారి బిపాసా బిడ్డకు జన్మనిచ్చింది.