బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. దీపావళి సందర్భంగా సాగిన నాలుగు గంటల షోలో పలువురు సెలబ్రిటీలు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మరోవైపు హౌజ్మేట్స్ కూడా అందంగా రెడీ అయి మంచి వినోదం పంచారు. ముందుగా నాగార్జున హౌజ్మేట్స్కి స్వీట్స్ పంచి ఆ తర్వాత గత వారం లేఖలు అందుకోలేకపోయిన వారికి తిరిగి లేఖలు తెప్పించి ఇచ్చాడు. ఇవి చదువుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.
కొద్ది సేపటి తర్వాత యాంకర్ సుమని లేడి బాస్గా ఇంట్రడ్యూస్ చేస్తూ హౌజ్లోకి పంపారు. గ్లాస్తో తయారు చేసిన ప్రతేకమైన గదిలో ఉన్న సుమ ఇంటి సభ్యులతో ఓ ఆటాడుకుంది. ఒక్కొక్కరిని ఇమిటేట్ చేసుకుంటూ తెగ సందడి చేసింది. అంతేకాదు వాళ్లతో పలు ఆటలు కూడా ఆడించింది. సుమతో ఎంటర్టైన్మెంట్ సందడిగా సాగగా, మధ్యలో బిగ్ బిస్ కంటెస్టెంట్స్ దివి, అవికా, మోనాల్ తమ డ్యాన్స్లతో ఎంటర్టైన్ చేశారు.
ఇక విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ విచ్చేసి ఇంటి సభ్యులతో మాట్లాడారు. వాళ్ల కోసం స్వీట్స్ ఇచ్చారు. ఉన్నంత సేపు వాళ్లని తెగ ఎంటర్టైన్ చేశారు. ఇక అవినాష్, బాబా భాస్కర్ తమదైన పంచ్డైలాగ్లతో నవ్వులు పంచారు. గాయని, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కల్పన పాడిన పేరడీ పాటలు కితకితలు పెట్టాయి. అరియానా, సోహైల్ కూడా హౌజ్మేట్స్తో కలిసి సందడి చేశారు. మంచి రోజులు వచ్చాయి’ చిత్ర బృందం సంతోష్ శోభన్, మెహ్రీన్, దర్శకుడు మారుతీ షోకు విచ్చేసి హౌస్మేట్స్తో సరదాగా ముచ్చటించారు. ఇక చివరిగా శ్రియ ఇంటి సభ్యుల పర్ఫార్మెన్స్ని చూసి రవి-జెస్సీ బెస్ట్ అని చెప్పి వెళ్లిపోయింది.