బిగ్ బాస్ బొమ్మల టాస్క్ ఎట్టకేలకు ముగిసింది. ఎవరు ఎన్ని బోమలు చేశారో చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించగా, ఇక్కడ కూడా ఆసక్తికరమైన ఫైట్ జరిగింది. మొదటి నుంచి కౌంటింగ్ అవసరం లేదంటూ గొడవకు దిగింది సిరి. సంచాలకురాలిగా నీ పవర్ను వృధా చేస్తున్నావని కాజల్ను హెచ్చరించాడు రవి. అయిన కూడా కాజల్ వెనక్కి తగ్గలేదు.
రెడ్ టీమ్ దగ్గర 17, గ్రీన్ టీమ్ దగ్గర 24 బొమ్మలు ఉన్నట్లు ప్రకటించింది. ఇక సిరి కూడా మరోసారి లెక్కపెట్టి బ్లూ టీమ్ 17, ఎల్లో టీమ్ 14 బొమ్మలు చేసినట్లు తెలిపింది. అయితే రెడ్ టీమ్ తమకు లభించిన స్పెషల్ బొమ్మ ద్వారా ఎల్లో టీమ్లోని సగం బొమ్మలను చెత్త బుట్టలో పడేసింది. అనంతరం బిగ్బాస్ హౌస్మేట్స్ మీద గరమయ్యాడు.
ఇంట్లోని కుషన్స్ని శ్వేత,లోబో చింపేసి అందులో దూసి తీసిన నేపథ్యంలో బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంచాలకులైన కాజల్, సిరి కూడా ఈ విషయంలో వారిని అడ్డుకులేకపోయారు. ఈ క్రమంలో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో అనర్హులుగా ప్రకటించారు. దీంతో కెప్టెన్ అయ్యే ఛాన్స్ పోయిందేనని సిరి కన్నీరుపెట్టుకుంది. షణ్ముఖ్ ఓదార్చాడు.