బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. ఈ షోకి మరో నాలుగు రోజులలో ముగింపు కార్డ్ పడనుంది. ప్రస్తుతం హౌజ్లో కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే ఉండగా, వారు తమ జర్నీ గురించి ముచ్చటించుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. మంగళవారం రోజు బద్రి సాంగ్తో షో మొదలైంది.
బిగ్ బాస్లో గ్రూపులుగా ఉన్న సిరి-షణ్ముఖ్లు ఓ వైపు.. మానస్-సన్నీలు మరోవైపు రెండు జంటలుగా గ్రాండ్ ఫినాలే కోసం ముచ్చటించుకుంటే.. ఏకాకిగా మారిన శ్రీరామ్ డల్గా కనిపించాడు. ఈ క్రమంలో షణ్ముఖ్.. జర్నీ చూపించేందుకు బిగ్ బాస్ అతడిని ఆహ్వానించాడు. గేమ్ చివరి దశకు చేరుకున్నా కూడా ఈ హగ్గుల ఫీవర్ మాత్రం తగ్గలేదు.
షణ్ముఖ్ జర్నీలో సగానికి పైగా మోజో రూం, సిరిలే కనిపిస్తున్నారు. అయితే మోజ్ రూం కనపడడంతో షణ్ముఖ్ గట్టిగా కేకలు వేశాడు. వంద రోజుల బిగ్ బాస్ జర్నీని చూసి చాలా థ్రిల్ అయ్యాడు. కష్టం, బాధ, కన్నీళ్లు తన జర్నీలో ఉండడంతో షణ్ముఖ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. బయట షణ్ముఖ్ వీడియో ప్లే అవుతుండగా,లోపల ఉన్న సిరి చాలా ఎగ్జైటింగ్ గా కనిపించింది.