బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు ఐదో సీజన్ జరుపుకునేందుకు సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా ఈ షోకి సంబంధించి వస్తున్న వార్తలు బుల్లితెర ప్రేక్షకులలో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.
సెప్టెంబర్ 5న షో ప్రారంభం కానుండగా, ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ని క్వారంటైన్లో ఉంచినట్టు తెలుస్తుంది. అయితే క్వారంటైన్లో ఉన్న ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, దీంతో షో వాయిదా పడే ఛాన్స్ ఉందటూ ప్రచారం నడుస్తూ వస్తుంది. అయితే అవన్నీ పుకార్లేనంటూ తాజాగా విడుదలైన పోస్టర్ ద్వారా అర్దమవుతుంది. బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉందని ఈ పోస్టర్ విడుదల చేయగా, దీంతో అన్ని పుకార్లకి బ్రేక్ పడింది.
షోలో పాల్గొనే కంటెస్టెంట్స్లో లోబో, ఇషా చావ్లా, సీరియల్ హీరో మానస్, సిరి హన్మంత్, యాంకర్ రవి, మోడల్ జశ్వంత్, షన్ముఖ్ జశ్వంత్, ఆర్జే కాజల్, నటి శ్వేత, సీరియల్ నటి ప్రియ, జబర్దస్త్ ఫేమ్ ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్, వర్షిణి, సీరియల్ హీరో వీజే సన్నీ, యానీ మాస్టర్, కార్తీకదీపం భాగ్య (ఉమా), లహరి రాబోతోన్నట్టు తెలుస్తుంది. ప్రియాంక, నవ్యస్వామి, యూట్యూబర్ నిఖిల్, ఆట సందీప్ భార్య జ్యోతి వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీటిపై పూర్తి క్లారిటీ సెప్టెంబర్ 5న రానుంది.