‘బిగ్బాస్-4’ ఫేమ్ అఖిల్ సార్ధక్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫస్ట్ టైమ్’. ఐ.హేమంత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అనిక విక్రమన్ కథానాయిక. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. నాయకానాయికలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్రావు క్లాప్కొట్టగా, దర్శకుడు నాగేశ్వరరెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘కామారెడ్డి నా స్వస్థలం. రొమాంటిక్ అడ్వెంచరస్ చిత్రమిది. కర్ణాటక అప్సర కొండ బీచ్లో ఫస్ట్ షెడ్యూల్ను తెరకెక్కించనున్నాం. ఆగస్ట్లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిదని, కథానాయకుడిగా తనకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకముందని అఖిల్ పేర్కొన్నారు.