ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన దవాఖానలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసినవారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొన్నిరోజులుగా తనతోపాటు ఉన్నవారంతా పరీక్ష చేయించుకోండి’ అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అమితాబ్ ప్రస్తుతం సోనీటీవీ రూపొందిస్తున్న కౌన్బనేగా కరోడ్పతి 14వ సీజన్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తున్నది. కాగా, బిగ్ బీ (Big B) మరోసారి కరోనా బారినపడటంతో ఆయన అభిమానులతోపాటు బాలీవుడ్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆయన తొందరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు.
T 4388 – I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around me, please get yourself checked and tested also .. 🙏
— Amitabh Bachchan (@SrBachchan) August 23, 2022
2020 జులై 11న అమితాబ్కు మొదటిసారిగా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ముంబైలోని నానావతి హాస్పిటల్లో చాలా రోజులపాటు చికిత్స పొందారు. కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యారాయ్, మనుమరాలు కూడా వైరస్ బారినపడ్డారు.