చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మోహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. శనివారం చిత్ర టీజర్ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి పాత్ర ఆద్యంతం సరదా పంచ్లు, యాక్షన్ హంగులతో ఆసక్తికరంగా సాగింది.
‘కౌన్ హై తూ’ అంటే ‘షికారుకు వచ్చిన షేర్ను బే..’ ‘ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నావాళ్లే..నాకు హద్దులు లేవు. సరిహద్దులు లేవు’ అంటూ చిరంజీవి చెప్పిన సంభాషణలు హైలైట్గా నిలిచాయి. ఈ సినిమాలో చిరంజీవి తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం విశేషం. కీర్తి సురేష్, సుశాంత్, రఘుబాబు, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, సంగీతం: మహతి స్వరసాగర్, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, సంభాషణలు: మామిడాల తిరుపతి, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్.