రాఖీపౌర్ణమి పర్వదిన వేళ మెగాభిమానుల ఆనందం అంబరాన్నంటింది. ఓవైపు పండుగ కోలాహలం, మరోవైపు మెగాస్టార్ జన్మదిన వేడుకల హంగామాతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆదివారం అగ్ర కథానాయకుడు చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయన కొత్త సినిమాల పోస్టర్స్ను విడుదల చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘భోళాశంకర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. బాబీ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో చిరంజీవి వింటేజ్మాస్ లుక్తో ఆకట్టుకుంటున్నారు.
చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రానికి ‘భోళా శంకర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఏ కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తిసురేష్ కీలక పాత్రధారి. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను ఆదివారం అగ్రహీరో మహేష్బాబు విడుదలచేశారు. చిత్రబృందం విడుదలచేసిన వీడియోలో చిరంజీవికి రాఖీ కడుతూ కీర్తిసురేష్ కనిపిస్తోంది. నిర్మాత మాట్లాడుతూ ‘కోల్కతా బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న చిత్రమిది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందించనున్నాం. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా కీర్తిసురేష్ కనిపిస్తుంది.త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. 2022లో ఈ సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు ‘చిరంజీవితో కలిసి నటించాలనే నా కల ఈ సినిమాతో తీరనుంది. ఈ అద్భుతమైన ప్రయాణం ప్రారంభం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని కీర్తిసురేష్ చెప్పింది.
పూనకాలు లోడింగ్..
చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాలో చిరంజీవి ఫస్ట్లుక్ పోస్టర్ ఆదివారం విడుదల చేశారు. ఇందులో ఆయన వింటేజ్ మాస్ లుక్లో కనిపిస్తున్నారు. లుంగీ ధరించి తలకు ఎర్రటి టవల్ చుట్టుకొని మాస్ అవతారంలో ఆకట్టుకుంటున్నారు. చేతిలో లంగర్ (యాంకర్) పట్టుకొని బోటుపై నిల్చుని ైస్టెలిష్గా దర్శనమిస్తున్నారు. పోస్టర్ను బట్టి సముద్రం బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇదని తెలుస్తోంది. పోస్టర్పై ‘పూనకాలు లోడ్ అవుతున్నాయి’ అనే క్యాప్షన్ ఆసక్తినిరేకెత్తించేలా ఉంది. చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. జి.కె.మోహన్ సహనిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర (బాబీ).