‘భీమదేవరపల్లి బ్రాంచి’ ఇది పూర్తి ఆర్గానిక్ గ్రామీణ జీవన చిత్రం. రెండు గంటలపాటు ప్రేక్షకుడిని నవ్వించడమే ధ్యేయంగా తెరకెక్కుతున్న సహజ చిత్రమిది’ అన్నారు చిత్ర దర్శకుడు రమేష్ చెప్పాల. పద్మ, ప్రసన్న, మానుకోట ప్రసాద్, గడ్డం నవీన్, మల్లికార్జున్, మహి, వల్లి సత్య ప్రకాష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బత్తిని కీర్తిలత గౌడ్ నిర్మాత. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ‘ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఎక్కడా సినిమాటిక్గా అనిపించకుండా నిర్మిస్తున్న పూర్తిగా సహజంగా, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రం ఇది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్-అర్జున్.