Bheemla Nayak | సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకు భీమ్లా నాయక్ చిత్రం ఐదో ఆట ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పవన్ అభిమానులు పండుగ చేసుకోనున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికాసేపట్లో యూసుఫ్గూడలోని పోలీసు గ్రౌండ్స్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్క్రీన్ప్లే,మాటలు త్రివిక్రమ్ అందిస్తుండగా..సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నిత్యామీనన్, సంయుక్తా మీనన్ లు నటించారు.