సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భారీ తారాగణం’. శేఖర్ ముత్యాల దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఆర్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్ర ట్రైలర్ను శుక్రవారం నిర్మాత యస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, నటుడు అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘థ్రిల్లింగ్ అంశాలతో సాగే లవ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. కరోనా లాక్డౌన్లో సినిమా ఆరంభించి ఎన్నో కష్టాలు పడ్డామని, అయినా టీమ్ సమిష్టి కృషితో మంచి అవుట్పుట్ వచ్చిందని నిర్మాత తెలిపారు. వినూత్న కథాంశంలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరో సదన్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్.వి.గోపి, సంగీతం: సుక్కు, దర్శకత్వం: శేఖర్ ముత్యాల.