సూర్యతేజ ఏలే హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయికగా నటిస్తున్నది. ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో శనివారం థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. హీరో సూర్యతేజను యంగ్ ఫిల్మ్మేకర్ రాజు సుందరం పాత్రలో పరిచయం చేస్తూ ట్రైలర్ మొదలైంది. అనుకోని పరిస్థితుల్లో తప్పుదారి పట్టిన అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారతాడు.
ఈ క్రమంలో జరిగిన పరిణామాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హర్షవర్ధన్ చక్కటి కామెడీ పండించాడు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోన వెంకట్ మాట్లాడుతూ.. క్రైమ్ కామెడీ జోనర్లో వచ్చే సినిమాలకు సక్సెస్ ఎక్కువని, ట్రైలర్లో హిట్ కళ కనిపిస్తుందని అన్నారు. ఈ సినిమాలోని పాత్రలన్నీ చాలా కొత్తగా ఉంటాయని, క్రైమ్ ఎలిమెంట్తో పాటు నలభై నిమిషాల కామెడీ హైలైట్గా నిలుస్తుందని దర్శకుడు కేవీఆర్ మహేంద్ర తెలిపారు.
యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ను అలరించే పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రమిదని హీరో సూర్యతేజ చెప్పారు. వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కథ: సూర్యతేజ ఏలే, దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర.