కోల్కతా: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్కు భారత రత్న ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. కోల్కతాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. అమితాబ్ ఓ లెజెండ్ అని, ఇండియాకు ఐకాన్ అని, ఆయనకు భారత రత్న ఇవ్వాలని అన్నారు. అధికారికంగా కాకపోయినా.. బెంగాలీల గొంతును వినిపిస్తున్నామని, భారత రత్న అమితాబ్జీ అంటూ ఆమె నినాదం చేశారు. చిత్ర పరిశ్రమకు అమితాబ్ చేసిన సేవలు అనితరసాధ్యమని ఆమె అన్నారు.