స్ట్రీమింగ్ తేదీ: ఈ నెల 9 నుంచి.
క్రైమ్ థ్రిల్లర్లకు, ఇన్వెస్టిగేషన్ చిత్రాలకు ఓటీటీ ప్రేక్షకులు బలంగా ఓటేస్తున్నారు. దీంతో దర్శక, నిర్మాతలు ఈ తరహా చిత్రాలను నిర్మించి నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న ‘భక్షక్’ సస్పెన్స్ జానర్ చిత్రంగా రూపుదిద్దుకుంది. భూమి పెడ్నేకర్, సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ్ తదితరులు ఇందులో నటించారు.
గౌరీఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పుల్కిత్ దర్శకత్వం వహించాడు. ఇందులో భూమి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నటిస్తున్నది. అనాథ శరణాలయాల్లో బాలికలపై జరుగుతున్న అకృత్యాలను కథానాయిక ఎలా బయటపెట్టింది, ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నది అన్నది కథ. బుధవారం విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో… ‘భక్షక్’ టీమ్ సినిమా రికార్డు స్ట్రీమింగ్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది.