‘ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నానో.. ఎలాంటి ఎమోషన్లు నా సినిమాలో ఉండాలని కోరుకున్నానో.. ఎలాంటి కేరక్టర్ పోషించాలని ఆశించానో అవన్నీ వందశాతం కుదిరిన సినిమా ‘భజే వాయువేగం’ అని హీరో కార్తికేయ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్కు ఐశ్వర్య మీనన్ కథానాయిక. ప్రశాంత్రెడ్డి దర్శకుడు.
యూవీ కాన్సెప్ట్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ను హైదరాబాద్ ఐమాక్స్లో ఘనంగా విడుదల చేశారు. కార్తికేయ ఇంకా మాట్లాడుతూ ‘కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ కథలో సహజంగా కుదిరాయి. చూస్తున్న వారు కథలో లీనమైపోతారు. మేమింత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే కారణం దర్శకుడు ప్రశాంత్.
మా టీమ్కు వెలకట్టలేని సంతృప్తినిచ్చిన సినిమా ఇది’ అని చెప్పారు. ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్ అని, పోస్ట్ప్రొడక్షన్కి ఎక్కువ సమయం తీసుకున్నామని, ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెరపై తెలుస్తుందని, అసాధారణ సమస్యలో ఇరుక్కున్న ఓ కామన్మ్యాన్ అందులోనుంచి ఎలా బయటపడ్డాడు? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా అని దర్శకుడు పేర్కొన్నారు. కథానాయిక ఐశ్వర్యమీనన్తో పాటు చిత్ర బృందం అంతా మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: మధు శ్రీనివాస్, కెమెరా: ఆర్.డి.రాజశేఖర్.