Daggubati Raana | బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా నేడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు నటుడు దగ్గుబాటి రానా (Raana). ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటుడు ప్రకాశ్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ రానా,
పలువురు నటులకు ఈడీ అధికారులు నోటీసులు పంపింది. ఈ నోటీసులలో భాగంగా ఇప్పటికే ప్రకాశ్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఈ విచారణలో భాగంగా తాజాగా రానా కూడా హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.