గణేష్ బెల్లంకొండ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘స్వాతి ముత్యం’. వర్ష బొల్లమ్మ నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఆగస్టు 13న సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ మాట్లాడుతూ…‘స్వాతిముత్యం లాంటి యువకుడి కథ ఇది. జీవితం, ప్రేమ, పెళ్లి వంటి విషయాల పట్ల తన ఆలోచనలు, అభిప్రాయాలు నిర్దుష్టంగా ఉంటాయి. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాల మధ్య తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేది వినోదాత్మకంగా చూపిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది’ అన్నారు. వీకే నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సూర్య, ఎడిటర్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్ల, సంగీతం : మహతి స్వరసాగర్.