బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా రాకేష్ ఉప్పలపాటి (రాఖీ) దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘నేను స్టూడెంట్ సార్’ సినిమా ట్రైలర్ను గురువారం సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ‘నాంది’ సతీష్వర్మ నిర్మిస్తున్నారు. అవంతిక కథానాయిక. ‘ఐఫోన్ కొత్త సిరీస్ అనౌన్స్మెంట్ రావడంతో అందరు యువకుల మాదిరిగానే హీరో గణేష్ ఎంతో ముచ్చటపడి ఫోన్ కొనుక్కుంటాడు. అది దొంగిలించబడటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు.
పోలీస్ అధికారులే తన ఫోన్ను తస్కరించారని గణేష్ చెప్పడం, ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. టీజర్ చాలా బాగుందని, బెల్లంకొండ గణేష్కు మంచి విజయం దక్కాలని వి.వి.వినాయక్ ఆకాంక్షించారు. కథలో మంచి కంటెంట్ ఉంది కాబట్టే సినిమాకు ఒప్పుకున్నానని, నిర్మాత సతీష్వర్మ ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారని హీరో బెల్లంకొండ గణేష్ తెలిపారు. వినూత్న కథాంశాలతో సినిమా తీయాలన్నదే తన అభిమతమని నిర్మాత ‘నాంది’ సతీష్వర్మ పేర్కొన్నారు.