బుల్లితెర బిగ్ రియాలిటీ షో చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్లో 9 మంది సభ్యులు ఉండగా, జస్వంత్ సీక్రెట్ రూంలో ఉన్నారు. బుధవారం రోజు బిగ్ బాస్ .. బీబీ హోటల్ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్ కీపింగ్ స్టాఫ్లో ఉంటూనే అతిథులకిచ్చే సర్వీసులను చెడగొట్టమని రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు.
బీబీ హోటల్లో శ్రీరామ్, షణ్ముఖ్ చెఫ్స్ గా ఉంటారని , యానీ మాస్టర్ మేనేజర్, రవి ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న హౌస్ కీపింగ్, మానస్- ప్రియాంక హనీమూన్కు వచ్చిన జంట, కాజల్.. హోటల్ ఓనర్కు స్నేహితురాలు, సన్నీ తొలిసారి 5 స్టార్ హోటల్కు వచ్చిన అతిథిగా, సిరి.. ఎంతో గారాబంగా పెరిగిన డాన్ కూతురుగా నటించాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పారు.
టాస్క్లో హోటల్ సిబ్బంది అతిథలు నుండి 15 వేల రూపాయలు గెలిస్తే వారు టాస్క్ గెలిచినట్టు లెక్క.సాధారణంగా ఈ టాస్క్లో గెస్ట్లుగా ఉన్న వారు హాటల్ వారితో సకల మర్యాదలు చేయించుకుంటూ వస్తున్న సంగతి సంగతి తెలిసిందే. ఈ సీజన్లోను అలానే సాగింది. పల్లెటూరి నుంచి ఫైవ్ స్టార్ హోటల్కు వచ్చిన గెస్టుగా సన్నీ నానా హంగామా సృష్టించాడు.