అక్టోబర్, సర్దార్ ఉద్దమ్ చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది బనితా సంధు. తాజాగా ఈ భామ తెలుగులో అడివి శేష్ సరసన కథానాయికగా అరంగేట్రం చేయబోతున్నది. వివరాల్లోకి వెళితే.. అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గూఢచారి-2’.
వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది.
ఈ సందర్భంగా బనితా సంధు మాట్లాడుతూ ‘నేను నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రలో కనిపిస్తా. టాలీవుడ్లో శుభారంభాన్నిచ్చే చిత్రమవుతుందనుకుంటున్నా’ అని చెప్పింది.