ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు పవన్ జపం చేస్తూనే మరోవైపు తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్తూ వస్తున్నారు. అలానే ట్విట్టర్లో సాయం కోరిన వారికి కూడా తన వంతు సాయం చేస్తున్నాడు బండ్ల.
కొద్ది రోజుల క్రితం.. బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నట్లు స్పష్టం చేశారు. నో కాంట్రవర్సీస్.. నా లైఫ్ లో అలాంటి వాటికి చోటు లేదు అంటూ ట్విట్టర్ వేదికగా బండ్ల పేర్కొన్నారు. మహేష్ బాబుని కించపరిచేలా బండ్ల కామెంట్ చేసినందుకు ఆయనని మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో అలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
కట్ చేస్తే బండ్ల గణేష్ మనసు మార్చుకున్నారు. ఓ జర్నలిస్టు సూచన మేరకు ట్విటర్లో తిరిగి కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు తన ట్వీట్లో ఈరోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని ఓ జర్నలిస్ట్ నాకు సలహా ఇచ్చారు. దానిని గౌరవంగా భావించి మీ అందరి ముందు కి మళ్ళీ వస్తున్నాను అంటూ బండ్ల ట్వీట్ చేసారు.దీంతో ఆయనకు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు.