టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్గా, నిర్మాతగా తనదైన హవా చాటిన బండ్ల గణేష్.. రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ వేసి వేనక్కు తగ్గారు. ఇక రీసెంట్గా హీరో అవతారం ఎత్తాడు. ‘డేగల బాబ్జీసగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బండ్ల. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు. ఇటీవల మూవీ ట్రైలర్ విడుదల కాగా, ఇది ఆసక్తిని పెంచింది.
బండ్ల గణేష్ సినిమాలతోనే కాదు సేవా కార్యక్రమాలతోను అందరి మనసులు గెలుచుకుంటారు. కరోనా సమయంలో సోషల్ మీడియాలో సాయం అడిగిన కొందరికి తన వంతు సాయం అందించాడు. తాజాగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు.
నేపాలీ పాపను తాను పెంచుకుంటున్నట్టు తెలిపాడు బండ్ల . ఓ రోజు పాప ఏడుస్తుంటే.. వాళ్ల అమ్మ దగ్గర ఏమీ లేక కేవలం పాలు మాత్రమే పట్టేదట. నా భార్య అలా చూసి.. మనం పెంచుకుందామని చెప్పింది. అలా ఇప్పుడు ఈ పాప మా ఇంట్లోకి ఓ మెంబర్ అయిపోయింది.. అందరూ కుక్కలు, పిల్లులు అని పెంచుకుంటారు. వాటి కోసం ఎంతో ఖర్చు పెడుతుంటారు.
నేను మాత్రం ఈ పాపను పెంచుకుంటున్నాను అని బండ్ల గణేష్ తెలిపాడు. మొత్తానికి ఆ పాప బాధ్యత తనది అని, మంచిగా పెంచాలి.. గొప్పగా చదివించాలని అనుకుంటున్నానని బండ్ల తెలిపాడు. ఇప్పుడు ఆ పాపే అందరినీ బెదిరించే స్థాయికి వచ్చిందని బండ్ల గణేష్ సరదాగా వ్యాఖ్యలు చేశాడు.