కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన పడి చాలా మంది ప్రముఖులు కన్నుమూసారు. కోట్ల ఆస్తులు ఉన్నవారు కూడా కరోనా నుండి తమను కాపాడుకోలేకపోయారు. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా చావు అంచుల వరకు వెళ్లొచ్చిన విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో పేర్కొ్న్నాడు.
కరోనా తనకు రెండో సారి వచ్చినప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారట బండ్ల. ఏ ఆసుపత్రికి ఫోన్ చేసినా కూడా బెడ్స్ లేవన్నారు. పవన్ కళ్యాణ్కి చేద్దామంటే ఆయనకు కరోనా వచ్చింది. ఇక చేయాలో తెలియక చిరంజీవికి కాల్ చేశాను. ‘ఏంటి గణేశ్’ అన్నారు. ‘అన్నా ఇదీ పరిస్థితి’ అని చెప్పా. వెంటనే అటు నుంచి మాట ఆగిపోయింది. ఫోన్ కట్ అయింది.
రెండు నిమిషాల తర్వాత మళ్లీ ఆయనే ఫోన్ చేశారు. ‘గణేశ్ అపోలోకి వెళ్లు. నేను చెప్పాను’ అన్నారు. ఆస్పత్రికి వెళ్తే, అప్పటికే 10మంది డాక్టర్లు నాకోసం ఎదురు చూస్తున్నారు. పరీక్షలు చేస్తే 80శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని రిపోర్ట్ వచ్చింది. దీంతో వెంటనే ఐసీయూకి తరలించి రెమ్డెసివర్ ఇంజెక్షన్ ఇచ్చారు. మూడు రోజులు ఐసీయూలో ఉన్నాను.ఒక్క రోజు లేట్ అయితే చనిపోయేవాళ్లు సర్ అని డాక్టర్స్ చెప్పారు. అసలు అంత తీవ్రస్థాయికి వెళ్లే వరకు ఆసుపత్రికి ఎందుకు వెళ్లలేదు అని చిరంజీవి తిట్టారు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.